ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెల్లడించింది. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25 వరకూ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే…నిన్న వైసీపీ పార్టీ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థులను రిలీజ్‌ చేసింది. ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news