కేశినేని నానిపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ ప్రశంసలు

-

కేశినేనిని ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్. కేశినేని నాని ఎవరో మొదట్లో నాకు తెలియదని.. 2014 ఎన్నికల ఫలితాల సమయంలో నాని నన్ను పలకరించారని గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్. అప్పుడే నాతో మీకు నియోజక వర్గంలో మంచి పేరుంది అన్నారు… అంతకు ముందు మా మధ్య పలకరింపు కూడా లేదని వివరించారు.

నియోజక వర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి వెళ్తానని.. ప్రజలు ఎంపీగా కేశినేనిని, ఎమ్మెల్యే గా నన్ను గెలిపించినపుడు మేం ఎందుకు మాట్లాడుకోకూడదని పేర్కొన్నారు. మేం ఇద్దరం ప్రజలకు సేవ చేయాలి అనుకుంటామని.. టాటా ట్రస్ట్ సేవలు తేవటంలో కేశినేని కృషి ఉందని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్. ఎన్టీఆర్ అందరి వాడు, ఆంధ్రులకు ఆత్మ గౌరవం నిలిపిన వ్యక్తి అన్నారు. రాజకీయ కోణంలో చూడటం వల్లే కేశినేని వ్యాఖ్యలు కొత్తగా అనిపిస్తాయి.. కేశినేని నాని సేవ చేయటం వల్లే ఆరు స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యే లు ఓడిపోయినా ఎంపీగా కేశినేని గెలిచారని వెల్లడించారు. కేశినేని సేవ చేయటం వల్లే ఎంపీగా కేశినేని గెలిచారన్నారు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్.

Read more RELATED
Recommended to you

Latest news