టికెట్ రాకున్నా వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే చిట్టి బాబు

-

టికెట్ రాకున్నా YCP గెలుపు కోసం కృషి చేస్తాన‌ని పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు అన్నారు. ‘నేను సామాన్య కార్యకర్తను.. నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత సీఎం జగన్ ది. పరిస్థితుల దృష్ట్యా ఈసారి నాకు టికెట్ దక్కలేదు. సీఎం జగన్ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి గెలుపు కోసం కృషి చేస్తాను. భవిష్యత్ లో మా కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు చిట్టిబాబు.

గొల్ల బాబు రావును రాజ్యసభకు పంపిస్తున్నందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్  ఏపీలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దళితుల  హృదయాల్లో నిలిచిపోయారు. వైఎస్సార్ సీపీ విజయం కోసం చివరి వరకు జెండాలు మోస్తామని చిట్టి బాబు వెల్లడించారు. జగన్ ని మళ్లీ సీఎం గా చేయడానికి ప్రజలందరూ సిద్ధం అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం టికెట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ ది అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news