జైల్లో ఉన్న వైఎస్‌ భాస్కరరెడ్డికి అస్వస్థత

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టై హైదరాబాద్‌లోని చంచల్‌ గూడ జైల్లో ఉన్న వైఎస్‌ భాస్కర రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయణ్ను జైలు వైద్యుల సిఫార్సుతో అధికారులు శుక్రవారం ఉదయం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాలుగైదు రోజులుగా ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండటం, ఈసీజీలోనూ వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

కార్డియాలజీ విబాగాధిపతి డా.ఇమాముద్దీన్‌ ఆధ్వర్యంలో వైద్యులు భాస్కరరెడ్డిని పరీక్షించి మొరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించి పంపినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ తెలిపారు. చికిత్స అనంతరం జైలు అధికారులు అతడిని తిరిగి చంచల్‌గూడ కారాగారానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం నిమ్స్‌కి తరలించే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news