నేడు పులివెందులలో నామినేషన్‌ వేయనున్న వైఎస్‌ జగన్‌

-

YS Jagan : ఇవాళ పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్‌. ఇవాళ ఉదయం 8:15 కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొనున్న సీఎం జగన్‌… కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకోనున్నారు.

cm jagan

పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన నున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11.25 నుంచీ 11.40 గంటల లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల నుంచి కడపకు చేరుకొని కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news