Telangana: సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం…6 గురు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు చాలా బలంగా ఢీ కొట్టింది.

crime

ఈ సంఘటనలో కారులో ఉన్న ఆరుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news