పరిహారం ఇవ్వకపోతే… ధర్నా చేస్తా..నేను వస్తే భయపడిపోతారు – జగన్

-

చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం జగన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అగ్ని ప్రమాద పరిహారం ఇవ్వకపోతే… నేనే వచ్చి ధర్నా చేస్తానని తెలిపారు. నేను వస్తున్నాను అంటే ఖచ్చితంగా భయపడుతారంటూ బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు‌.

YS Jagan visits Achyutapuram SEZ victims

అనకాపల్లి జిల్లాకు మాజీ సీఎం జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం సెజ్‌ బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులతో మాట్లాడారు జగన్. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం జగన్‌. అనంతరం మాట్లాడారు.

ఎసెన్సియా ప్రమాదంపై ప్రభుత్వ స్పందించిన తీరు బాధాకరం అన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన 24 గంటల్లో కోటి రూపాయల పరిహారం అందించామని గుర్తు చేశారు. ఈ ప్రమాదంపై మంత్రులు, అధికారులు చాలా ఆలస్యంగా స్పందించారని ఆగ్రహించారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news