జగన్ కోసం 3200 కీమీ పాదయాత్ర చేస్తే..నాకే నష్టం చేశాడు – వైఎస్‌ షర్మిల

-

వైసీపీ కోసం 3200 కీమీ పాదయాత్ర చేస్తే..నాకే నష్టం చేశాడని… సీఎం జగన్ పై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి కారణం జగన్ అని… చేజేతులరా ఆయనే చేసుకున్నారని ఫైర్ అయ్యారు. దానికి సాక్ష్యం దేవుడు, విజయమ్మ, నా కుటుంబం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్‌ షర్మిల. జగన్… నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని…ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి సదస్సులో మాట్లాడారని నిప్పులు చెరిగారు.

ys sharmila counter to cm jagan

సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడని…జగన్ కోసం 3200 కిలో మీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. సమైక్యాంద్ర కోసం యాత్ర చేశానని…స్వలాభం చూసుకోకుండా, ఏది అడిగితే అది జగన్ కోసం చేశానని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేస్తాడని నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించానని ఎమోషనల్‌ అయ్యారు కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని బీజేపీకి బానిసలుగా మార్చారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news