ఏపీలోని మైనార్టీల ఓట్లపై షర్మిల గురి – వైసీపీ ఎంపీ

-

 

వై.యస్. షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని రఘురామకృష్ణ రాజు గారు ఘాటు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన తొలి ప్రసంగం ద్వారానే ఆమె రానున్న రోజుల్లో గట్టిగా పోరాడనున్నారని అర్థమయిందని, తన తొలి ప్రసంగంలోనే ఆమె స్పృశించిన అంశాన్ని పరిశీలిస్తే జగన్ మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకుకు బ్యాండ్ పడేలా ఉందని అన్నారు.

మైనార్టీల ఓట్లపై షర్మిల గురి ఉంటుందని చెప్పారు. మణిపూర్ అల్లర్లను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన సహాయ సహకారాలను అందించిందని, ఏ ఒక్క వర్గానికి అన్యాయం చేయలేదని, ఏ మతాన్ని ప్రోత్సహించలేదని, మణిపూర్ లోని తెగల మధ్య అంతర్యుద్ధంగా అల్లర్లు పరిణమించాయని, ఆ అల్లర్లు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయని, అయినా అక్కడ చర్చిల ధ్వంసం గురించి షర్మిల గారు మాట్లాడారని, జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పృశించని అంశాన్ని, తాను స్పృశించడం ద్వారా ఒక వర్గం ఓట్లకు గండి కొట్టాలన్నదే ఆమె లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. .

Read more RELATED
Recommended to you

Latest news