నేడు ఏపీకి వెళ్లనున్న వైఎస్‌ షర్మిల..కారణం ఇదే

-

నేడు ఏపీకి వెళ్లనున్నారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కుటుంబ సమేతంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలు దేరుతారు.

YS Sharmila is going to AP today

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపుల పాయ ఎస్టేట్ లోని YSR ఘాట్ వద్ధకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ఇక ఘాట్ వద్ద కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారి వివాహ పత్రికను ఉంచి నివాళులు అర్పిస్తారు. కాగా, వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె తనయుడు వైఎస్ రాజారెడ్డి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ శుభవార్తను షర్మిల తన అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఈ గుడ్ న్యూస్ను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news