DK శివ కుమార్ ను కలిసిన వైఎస్‌ షర్మిల

-

వైఎస్‌ షర్మిల బెంగళూరు వెళ్లారు. ఇవ్వాళ కర్నాటక ఉప ముఖ్యమంత్రి & KPCC చీఫ్ dk శివకుమార్ ను వైఎస్‌ షర్మిల కలిసారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు APCC చీఫ్ షర్మిల. అనంతరం తాజా ఏపీ రాజకీయాలపై చర్చించారు. అనంతరం కడపకు వైఎస్‌ షర్మిల బయలు దేరారు.

YS Sharmila meets DK Shivakumar

అంతకు ముందు…జగన్‌ సర్కార్ పై ఏపీసీసీ ఛీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలి…ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదన్నారు. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే సిగ్గుపడాలి…మేము అదిచేసాం ఇది చేసాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదని వెల్లడించారు.
ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news