వైఎస్ షర్మిలను గెలిపించండి అంటూ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. కడప ప్రజలు రాజశేఖర్ రెడ్డి ని ఆదరించారు….రాజశేఖరరెడ్డి ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవలోనే ఉన్నారని వెల్లడించారు. ఇవాళ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందని వివరించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/ys-vijayamma-supports-ys-sharmila.webp)
రాజశేఖరరెడ్డి కూతురును పార్లమెంటుకు పంపమని నా విన్నపం అంటూ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. దీంతో వైసీపీ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. కాగా వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.