వైఎస్ విగ్రహాలు తగలబెడుతున్నారు…మాకు న్యాయం లేదా? – వైవీ సుబ్బారెడ్డి

-

వైఎస్ విగ్రహాలు తగలబెడుతున్నారు…మాకు న్యాయం లేదా? అంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై దాడులు జరగడంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఏపీ వ్యాప్తంగా టీడీపీ జన సేన నేతల అధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలపై ఎటాక్ చేస్తున్నారు… వైఎస్ ఫోటో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహించారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. గతంలో గవర్నర్ కు ఫిర్యాదు చేశాం….పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని మండిపడ్డారు.

yv subbareddy

వైసీపీకి ఓట్లు వేసిన వారిపై కూడా దాడులు చేస్తున్నారు… వైసీపీ అఫీసుల్లోకి అక్రమంగా చొరబడి బిల్డింగ్స్ కూల్చివేత చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ విగ్రహాలు తగలబెట్టే పరిస్థితి ఉంది… వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. వైసీపీ కార్యాలయాలకు రూల్స్ ప్రకారం స్థలాలు కేటాయించామని తెలిపారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. గతంలో టీడీపీ, బీజేపీ కార్యాలయాలకు స్థలాలు మంజూరు చేసినట్టే వైసీపీ కి చేశాం…అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news