బాబు గారి పై ఉన్న కోపం.. జగన్ వారిపై చూపిస్తున్నారు..?

-

ప్రజల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికి సరైనది కాదు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన ఆయన… అమరావతి విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి జగన్ సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమాన్ని మాత్రం ఆపలేరు అంటూ విమర్శించారు.

అమరావతి రాజధాని మార్పు విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు రెఫరెండం గా ఎన్నికలకు వెళ్లాలి అంటూ సవాల్ విసిరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒకవేళ ఈ ఎన్నికల్లో మళ్లీ జగన్ కు ఒక్క సీటు వచ్చినా కూడా… అమరావతి పై మళ్లీ నోరెత్తబోము అంటూ తెలిపారు. అంతేకాకుండా టిడ్కో గృహాలను కూడా లబ్ధిదారులకు వెంటనే అంద చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news