విజయసాయి రెడ్డి ముసలి నక్క కాదు…పండు కోతి – అనిత

-

జూమ్ కాన్ఫరెన్సులో చొరబడడం ఏదో సన్నాసులు పనిగా భావించామని.. జూమ్ లో చొరబడడం కూడా తాడేపల్లి స్క్రిప్ట్ అని ముసలి నక్క మాటలతో అర్థమైందని వంగలపూడి అనిత ఫైర్‌ అయ్యారు. విజయసాయి రెడ్డిని ముసలి నక్క అనే చాలా మంది అంటారని.. నేను విజయసాయిని పండు కోతి అనే అంటాను… విజయసాయిరెడ్డికి విశాఖ మీద మోజు తీరిందని.. విజయవాడ మీద మోజు పెరిగిందని అంటున్నారన్నారు వంగలపూడి అనిత.

అది ఎలాంటి మోజు విజయవాడలోని వైసీపీ నేతలకే తెలియాలి… పండు కోతికి విజయవాడ మీద మోజు పెరిగింది.. ఇక్కడి వైసీపీ నేతలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీతో చర్చకు లోకేష్ ఎందుకు..? నేను చాలు… పదో తరగతి పరీక్షలపై నేను చర్చకు వస్తాను.. దమ్ముంటే ఎవరో వస్తారో రండని సవాళ్ విసిరారు. నేను ఒక్కదాన్నే చర్చకు వస్తాను.. మీరు ఎంత మంది అయినా రావాలని… పట్టాభి.. అనిత వంటి వాళ్లని ఏదో చేస్తామంటూ విజయసాయి అంటున్నారన్నారు. ఇది అంతం కాదు ఆరంభం అంటువ్న విజయసాయికి ఓ సవాల్ విసిరారు. వైసీపీ ఏం చేసినా ఎదుర్కొవడానికి మేం సిద్దంగా ఉన్నాం.. మేం చేసే దానికి వైసీపీ సిద్దంగా ఉందా..? అని ఛాలెంజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news