నయన్ దంపతులకు టీటీడీ నోటీసులు..క్షమాపణలు చెప్పిన విఘ్నేష్

-

తిరుమల….శ్రీవారి ఆలయం వద్ద నిన్న నయనతార,విగ్నేష్ దంపతులు ఫోటో షూట్ కు దిగారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి ఆలయం ముందుకు పాదరక్షలతో వచ్చిన నయనతార… ఫోటో షూట్ సందర్బంగా నయనతారను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అయితే.. ఆలయ పరిధిలోకి నయనతార చెప్పులు వేసుకుని రావడం ఇప్పుడు వివాదంగా మారింది.

ఈ నేపథ్యంలోనే.. నయనతార జంటకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. అయితే.. దీనిపై నయన్‌ భర్త విఘ్నేష్‌ స్పందించారు. టీటీడీకి క్షమాపణలు చెబుతూ… లేఖ కూడా రాశారు విఘ్నేష్‌. తమకు తిరుమల శ్రీ వారి సన్నిధి ఎంతో అచ్చొచ్చిందని పేర్కొన్నారు.

కానీ తిరుమల లో పెళ్లి చేసుకోవడం తమకు కుదరలేదని.. అందుకే మహా బలేశ్వరంలో పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు విఘ్నేష్‌. ఇక నయన్‌ చెప్పులు వేసుకుని రావడంపై తాను క్షమాపణలు అడుగుతున్నట్లు పేర్కొన్నారు. భక్తుల తాకిడి వల్లే.. ఈ తప్పిదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news