WomensIPL : ఐపీఎల్ వేలంలో క‌ర్నూలు అమ్మాయికి జాక్ పాట్..రూ.55 ల‌క్షలకు కొనుగోలు

-

ముంబైలో ఇవాళ మహిళల ప్రీమి యర్ లీగ్ వేలం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో.. మహిళా క్రికెటర్లపై కోట్ల వర్షం కురిసింది.  ఈ వేలంలో…క‌ర్నూలు అమ్మాయి అంజ‌లి శ‌ర్వాణికి జాక్ పాట్ తగిలింది. క‌ర్నూలు అమ్మాయి అంజ‌లి శ‌ర్వాణిని రూ.55 ల‌క్షలకు కొనుగోలు చేసింది యూపీ వారియ‌ర్స్. కృష్ణా జిల్లా అమ్మాయి స‌బ్బినేని మేఘ‌న‌ను రూ.30 ల‌క్షల‌కు కొనుగోలు చేసింది గుజ‌రాత్ జెయింట్స్.

ఇందులో స్మృతి మందానాను రూ.3.4 కోట్లకు దక్కించుకుంది బెంగళూరు. అటు హర్మన్ ప్రీత్ ను రూ 1.8 కోట్లకు దక్కించుకుంది ముంబై. అలాగే, జెమియా రోడ్రిగ్స్‌కు రూ.2.20 కోట్లు, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్‌ను రూ.కోటికి స్వంతం చేసుకుంది ముంబయి ఇండియన్స్. దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టార్‌ షబ్నిమ్ ఇస్మాయిల్‌ను రూ. కోటికి, ఇంగ్లాండ్ బ్యాటర్‌ సోఫియా డంక్లీని యూపీ వారియర్స్‌ రూ.60 లక్షలకు స్వంతం చేసుకుంది యూపీ వారియర్స్‌. ఆసీస్‌ రన్‌ మెషీన్‌ బెత్ మూనీని 2 కోట్లకు దక్కించుకుంది గుజరాత్ జెయింట్స్. అలాగే, ఇంగ్లాండ్ బ్యాటర్‌ సోఫియా డంక్లీని రూ.60 లక్షలకు దక్కించుకున్న యూపీ.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్‌గ్రాత్‌ను రూ.1.40 కోట్లకు దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news