భీమ్లా నాయక్ నుంచి మరో బిగ్ అప్డేట్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా “భీమ్లా నాయక్ ” టైటిల్ ను ప్రకటించి పవన్ ఫాన్స్ లో ఊపు తెప్పించింది. అయితే భీమ్లా నాయక్ సినిమా నుంచి… తాజాగా మరో అప్డేట్ రాబోతోంది. “ఇప్పటి వరకు పవర్ తుఫాను చూశారు. ఇప్పుడు గెట్ రెడీ ఫర్…. ఇవాళ సాయంత్రం 04;05 గంటలకు సిద్ధంగా ఉండండి” అంటూ భీమ్లా నాయక్.. సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ స్పష్టం చేసింది. కాగా ఇంతవరకూ హీరో రానా కు సంబంధించి ఒక అప్డేట్ కూడా రాలేదు. దీన్నిబట్టి ఈ రోజు రానా గురించి అప్డేట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news