BIG BREAKING: చంద్రబాబుపై మరో కేసు

-

చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసింది. బాబును ఏ3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణకు కోర్టు అనుమతించింది. బాబు ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇది ఇలా ఉంటె, ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతల మాటల దాడి మరింత పెరిగింది. అదే సమయంలో తన వ్యాఖ్యలతో కలకలం రేపే వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబును ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రబాబు పోతాడు, జగన్ సీఎం అవుతాడంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Breaking: Another Case Filed On Chandrababu Naidu

దీంతో తన ఉద్దేశం అది కాదంటూ టీడీపీ రాజకీయంగా చనిపోతుందని మాత్రమేనంటూ వివరణ కూడా ఇచ్చారు. ఇవాళ ఆ పాత వ్యాఖ్యను కాస్త అటు ఇటు మార్చి గోరంట్ల మాధవ్ ఇవాళ మరోసారి ప్రయోగించారు. ఈసారి మాధవ్..చంద్రబాబు బతకాలి, జగన్ రెండోసారి సీఎం అవడం చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతాడని చంద్రబాబు చస్తాడు అంటూ వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈసారి మరో విధంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు బతకాలి… జగన్ రెండోసారి సీఎం కావడం చూసి ఆయన ఏడవాలి అని ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news