పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మరో మెగా హీరో ప్రచారం

-

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు మే 13 న జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ప్రస్తుతం పిఠాపురంపై పడింది.దేశ రాజకీయాలు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఒక ఎత్తుగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన జనసేనాని ఈ సారి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

అలాగే ఆ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపైనర్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కు మద్దతుగా టాలీవుడ్ యాక్టర్లు కదం తొక్కుతున్నారు.

ఇందులో భాగంగా మొదట జబర్దస్త్ నటులు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చంటి, రాజు, వంటి వారు ప్రచారం చేశారు.అలాగే సీరియల్ నటులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ 2 రోజుల పాటు పిఠాపురంలో తన బాబాయ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా మెగా మేనల్లుడు హీరో వైష్ణవ్ తేజ్ ఈ రోజు కొండెవరం గ్రామంలో పవన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించగా, జనసేన కార్యకర్తలు, ఆ ప్రాంత ప్రజలు అతనికి అడుగడుగునా నీరాజనం పట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news