మరో మంత్రిని బలి తీసుకున్న కరోనా రక్కసి..?

-

దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ అందరిపై పంజా విసురుతోంది. సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనే తేడా చూడకుండా అందరినీ బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే ఎంతో మంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే మరో మంత్రిని బలితీసుకుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. కరోనా వైరస్ బారినపడి బీహార్ మంత్రి మరణించారు. బీహార్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ దియా కామత్ ఇటీవలే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు ఆయన. ఇక క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాలు వదిలారు. ఇక మంత్రి మృతిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా బబుబర్తి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news