కెసిఆర్ కనుసన్నల్లో మరో ప్రాంతీయ పార్టీ రాబోతుంది – NVSS ప్రభాకర్

-

సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ కనుసన్నల్లో మరో ప్రాంతీయ పార్టీ రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలనను గాలికి వదిలేసారని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాకుండా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

విభజన సమస్యలపై కేంద్రం మీటింగ్కు ఏపీ వాళ్లు హాజరైతే తెలంగాణ వాళ్ళు వెళ్లడం లేదని.. తెలంగాణ వాళ్లు హాజరైతే ఏపీ వాళ్ళు వెళ్లడం లేదని మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరుతో రెండు రాష్ట్రాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news