శంకర్ పై కోపంగా ఉన్న , రామ్ చరణ్ దిల్ రాజు..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.ఈ సినిమా తో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తున్నాడట.అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా ఎలక్షన్ ప్రచారం కు సంబందించిన సీన్లు విశాఖ పట్టణం ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ లోకేషన్స్ సీన్లు లీక్ అయి మీడియా లో వైరల్ గా మారాయి. ఇందులో రామ్ చరణ్ ఓల్డ్ గెటప్ లో తన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నాడు. ఈ సారి షూటింగ్ కర్నూల్ జిల్లాలో ఉన్న కొండారెడ్డి బురుజు దగ్గర  జరగబోతోందని తెలుస్తోంది.

అయితే ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రామ్ చరణ్ సినిమాకు 10 రోజులు, కమల్ హాసన్ సినిమా కు పది రోజులు కేటాయించి పనిచేస్తున్నాడు శంకర్. కాని దిల్ రాజు వేసుకున్న ప్లాన్ కు అదనంగా బడ్జెట్ పెరిగిపోతోంది. అయితే శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను ఈ ఏడాది సమ్మర్ చివరలో విడుదల చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. కాని అది సాధ్యం అయ్యే పని కాదని తెలుస్తోంది. అసలే శంకర్ అంటే పర్ఫెక్షన్ కు పేరు, తాను హడావుడి గా తీసే రకం కాదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మొత్తం రామ్ చరణ్, దిల్ రాజు సినిమా పై పడుతుందట. దానితో ఇచ్చిన హామీ మేరకు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేయాలని శంకర్ పై కోపగించు కున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news