BREAKING : వరంగల్ లో ర్యాగింగ్‌కు మరో విద్యార్థి రక్షిత ఆత్మహత్య

-

మెడికల్‌ విద్యార్థిని ప్రీతి సంఘటన మరువక ముందే… వరంగల్‌ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో రాగింగ్ కలకలం రేపింది. ఓ విద్యార్థి వేధించడంతో మనస్థాపం చెంది.. రక్షిత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

రక్షిత( 20) స్వస్థలం భూపాలపల్లిగా గుర్తించారు పోలీసులు. జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం ఈసీ చదువుతున్న రక్షిత. వరంగల్ లో ఉంటున్న తన బంధువుల ఇంట్లో ఉరి వేసుకుంది మెడికల్‌ విద్యార్థి రక్షిత. పోస్టు మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురికి మృతదేహం తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news