‘డీజే టిల్లు 2’లో అనుపమే ఫిక్స్‌.. ఇదిగో ప్రూఫ్​

-

‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్​గా ‘టిల్లు స్వ్కేర్‌’ని తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం అదే ఏడాది దీపావళి కానుకగా ప్రకటించింది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుందని వెల్లడించింది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనుపమ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని వదంతులు వచ్చాయి.

ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వెనక్కి వచ్చేసిందని, ఆ స్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందని.. ఇలా పలు రకాల ఊహాగానాలు పలు వెబ్‌ సైట్లు, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఎక్కడా స్పందించని అనుపమ తాజా పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది.

ఆ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన ఆమె హీరో సిద్ధు జొన్నలగడ్డ జుత్తుకు జెల్‌ (క్రీమ్‌) రాస్తూ కనిపించింది. ‘ఇది నా ప్రత్యామ్నాయ వృత్తి’ అంటూ సంబంధిత వీడియోను అనుపమషేర్‌ చేసింది. ‘డిజే టిల్లు’కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్‌ను రామ్‌ మల్లిక్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తొలి భాగంలోని హీరో పాత్ర టిల్లు, హీరోయిన్‌ పాత్ర రాధిక (నేహాశెట్టి) యువతను కట్టిపడేశాయి.

https://www.instagram.com/p/CnPVBSXhdO8/

Read more RELATED
Recommended to you

Latest news