‘డీజే టిల్లు 2’ నుంచి అనుపమా పోస్టర్ రిలీజ్

-

‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్​గా ‘టిల్లు స్వ్కేర్‌’ని తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం అదే ఏడాది దీపావళి కానుకగా ప్రకటించింది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుందని వెల్లడించింది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనుపమ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని వదంతులు వచ్చాయి.

ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వెనక్కి వచ్చేసిందని, ఆ స్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందని.. ఇలా పలు రకాల ఊహాగానాలు పలు వెబ్‌ సైట్లు, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఎక్కడా స్పందించని అనుపమ ఓ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా, ఇవాళ అనుపమా పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో… అనుపమాకు బర్త్‌ డే విశేష్‌ చెప్పింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news