మొసళ్ల స‌ర‌స్సులో ఈత‌..మోడీపై ఏపీ బీజేపీ పోస్ట్ వైర‌ల్..!

-

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎంతో క‌ష్ట‌ప‌డి ప్ర‌ధాని స్థాయి వ‌చ్చార‌ని చెబుతుంటారు. ఆయ‌న జీవితంలో కొంత‌కాలం పాటు ఛాయ్ కూడా అమ్మార‌ని చెబుతుంటారు. అయితే ఛాయ్ అమ్మ‌డం ఎంతో క‌ష్ట‌ప‌డం న‌మ్మేవిష‌య‌మే. కానీ ఏపీ బీజేపీ అధికారిక సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ న‌మ్మేలా లేదు…దాంతో ఆ పోస్ట్ పై విమ‌ర్శ‌లు ట్రోల్స్ వ‌స్తున్నాయి. తెలివైన‌పిల్ల‌వాడు న‌రేంద్ర అంటూ ఏపీ బీజేపీ ఈ పోస్ట్ ను చేసింది.

ఇక పోస్ట్ లో అత‌నికి కేవ‌లం ఏడు నుండి ఎనిమిది సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు మొస్స‌ళ్లు ఉన్న స‌ర‌స్సులో ఈదేవాడు..ఆల‌య శిఖ‌రం పై జండాలు ఎగ‌ర‌వేశాడు. అంతే కాకుండా అదే స‌ర‌స్సులో నుండి ఓ మొస‌లి పిల్ల‌ను కూడా న‌రేంద్ర ఇంటికి తీసుకువ‌చ్చాడు. దాంతో అత‌డి త‌ల్లి మ‌ళ్లీ ఇలాంటి ప‌నులు చేయ‌కూడ‌ద‌ని చెప్ప‌డంతో ఆ మొస‌లి పిల్ల‌ను నీటిలో వ‌దిలేసి వ‌చ్చాడు. అంటూ ఏపీ బీజేపీ చిన్న క‌థ‌ను పోస్ట్ చేసింది. ఇక ఈ క‌థ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news