ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో 2672 కేసులు నమోదు

-

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కేసులు కాస్త పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2672 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,34,227 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 18 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,115 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,96,071 లక్షలకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 2467 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 91,594 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 34, 88, 031 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news