ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా ?

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండీ ఈ కేసులు ఎనిమిది వేలకి చేరువలో నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6923 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,75,674కి పెరిగింది.

ap-corona
ap-corona

ఒక్కరోజు వ్యవధిలో మరో 46 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5708కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64,876 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఎనిమిది వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 480, చిత్తూరులో 577, తూర్పు గోదావరి జిల్లాలో 1006, గుంటూరులో 535, కడపలో 472, కర్నూలులో 229, కృష్ణా జిల్లాలో 333, నెల్లూరులో 506, ప్రకాశంలో 659, శ్రీకాకుళంలో 503, విశాఖపట్నంలో 318, విజయనగరంలో 376, పశ్చిమ గోదావరిలో 929 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news