ఏపీలో కొత్తగా 351 కరోనా పాజిటివ్‌ కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా విస్తరిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. వీటిలో 275 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా 76 ఇతర ప్రాంతాలకు చెందిన వారివని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,555కి చేరుకుంది. వీరిలో 2,906 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 90 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,559కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news