ఏపీలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా తీవ్రత..!

-

ఆంధ్రప్రదేశ్ పై కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వణికిపోతున్నారు. అటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా అందులో 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news