ఏపీలో మళ్లీ తగ్గిన కరోనా : కొత్తగా 540 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు… తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు రెండు వేలకు పైగా నమోదైన కరోనా మహమ్మారి కేసులు… ఇప్పుడు వెయ్యి లోపే నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మరోసారి కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా… 540 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,59, 122 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 10 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,286 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 557 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,38, 248 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 40 , 350 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 88, 79 , 945 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6588 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news