ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ఒక మరణం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గతం కంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,70, 093 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 443 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2149 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 183 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 56, 501 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 29 , 595 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 04 , 46 , 677 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news