ఏపీ లో కొత్తగా 184 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీలో లో కరోనా కేసులు నిన్నటి కంటే భారీగా పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో కొత్తగా 184 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా మరణించారు.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,74, 036 కి పెరిగింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 455 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2008 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 204 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 57 , 573 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 30 , 747 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 06 , 19, 555 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news