ఏపీలో కరోనా టెర్రర్.. ఒక్క రోజే 3 వేలు దాటిన కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 3000 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2087879 కి పెరిగింది.

ap carona
ap carona

ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్ వల్ల ఎటువం టి మరణము సం భవిం చలేదు. ఇక కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10119 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 281 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2063255 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,17,08,637 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news