ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 13,618 కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,22,573 కి పెరిగింది.


ఒక్క రోజు వ్యవధి లో మరో 9 చని పోవడం తో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 570 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 6318 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8687 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2101685 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 49, 143 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 22, 83, 369 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news