ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

-

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 127 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,71, 371 కి పెరిగింది.

carona
 

ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 428 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2206 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 184 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 54 , 737 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 18, 777 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 01 , 97 , 561 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతంలో కంటే.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం శుభపరిణామం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news