ఏపీలో తగ్గిన కరోనా… ఇవాళ కొత్తగా 326 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,67, 255 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడం తో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 386 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3898 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 466 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 48 , 971 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 37 , 985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 94 , 15 , 741 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news