ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో 478 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్న జరిగిన కరోనా కేసులు.. ఇవాళ మరోసారి తగ్గాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2062781 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఐదు గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 327 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 5500 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 574 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 43, 494 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 91, 85 , 656 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2043050 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news