BIG Breaking: మూడు రాజధానులపై సుప్రీంకి ఏపీ సర్కార్‌

-

BIG Breaking: మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌.. సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని తన పిటీషన్ లో కోరింది.

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారులను ప్రశ్నించడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.

కాగా.. గతంలో ఏపీ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును హై కోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌ వెనక్కి తగ్గింది. ఇక తాజాగా ఇదే విషయంపై సుప్రీం కోర్టు మెట్లెక్కింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news