ఏపీ మూడు రాజధానులపై జ‌గ‌న్ స‌ర్కార్‌ కీల‌క‌ నిర్ణయం..

-

ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించేందుకు హై పవర్ కమిటీని సీఎం జగన్ నియమించారు. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం సీఎంఓ ప్రకటించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన కమిటీ ఏర్పడగా, మొత్తం 16 మంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో మంత్రులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకూ స్థానం లభించింది.

చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కమిటీ కన్వీనర్ గా వ్యవహరించనుండగా, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, మేకతోటి సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నానిలతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, అజయ్ కల్లాం సభ్యులుగా ఉంటారు. ఇక ఈ కమిటీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) నివేదికలను అధ్యయనం చేసి, మూడు వారాల్లోగా సూచనలతో కూడిన నివేదికను ఇవ్వాల్సివుంటుంది. ఈ మేరకు నేడు జీవో జారీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news