ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి. రేషన్ షాపు దుకాణాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ఇంటి వద్ద రేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. వృద్దులు అలాగే దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు ఇవ్వాల్టి నుంచి ఏర్పాట్లు చేసింది.

జులై నెల రేషన్ ఐదు రోజుల ముందుగానే ఇవ్వాలని అధికారులు అలాగే డీలర్లకు ఇప్పటికే ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో సమాచార లోపంతో వృద్ధులు అలాగే దివ్యాంగులు రేషన్ షాపుల వద్దకు రావడంతో తాజాగా ప్రభుత్వమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఏపీలోని వృద్ధులు అలాగే దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.