ఏపీ కరోనా బులిటెన్ కొత్తగా ఎన్ని కేసులంటే..?

-

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారీగా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా రికవరీ రేటు పెరగడంతో పాటు కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోవడంతో ఏపీ ప్రజలందరూ ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో ప్రస్తుతం క్రమక్రమంగా ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతుంది. దీంతో కేసుల సంఖ్య భారీగా తగ్గి పోతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్ విడుదల చేసింది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ. కాగా నేడు కొత్తగా 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13 మంది కరోనా వ్యాధి బారినపడి చనిపోయారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 17 వేల 892 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news