వివేకా కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు

-

కడపలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వివేకా హత్య కేసుని ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నీ మధ్య ఆ సంస్థ విచారణ పై ఏపీ హైకోర్టుకు వెళ్ళడం సంచలనంగా మారింది. నిజానికి సి.బి.ఐ వివేకా హత్య కేసుకు సంబందించిన రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను కోరింది. అయితే అలా ఇచ్చేందుకు తమకు ఆదేశాలు లేవని ఆ రికార్డులన్నీ ఇవ్వడానికి మెజిస్ట్రేట్ నిరాకరించారు. దీంతో రికార్డులన్నీ తమకు ఇచ్చేలా కింది కోర్టుని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది సీబీఐ.

అయితే ఈ పిటిషన్ ని విచారించిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‍ ని ఆదేశించింది. రికార్డులు ఇచ్చేందుకు నిరాకరించడంతో గతంలో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. రికార్డులు సీబీఐకి ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఈ కేసుని సీరియస్ గా తీసుకుంది. కొన్ని రోజుల పాటు సుదీర్ఘ విచారణలు కూడా చేసింది. అయితే ఆ టీం అంతా కరోనా బారిన పడడంతో ఢిల్లీకి తిరిగి వెళ్ళి పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news