ఏపీలో కొత్త ఇసుక పాలసీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

-

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొత్త పాలసీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజ్ లు గా విభజించింది. మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ ఇసుక కొత్త పాలసీకి ఆమోదం లభించడంతో ఇప్పుడు దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ 1 పరిధిలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఉండనుంది. ఇక ప్యాకేజీ 2 పరిధిలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉండనున్నాయి.

ఇక మూడో ప్యాకేజ్ విషయానికి వస్తే నెల్లూరు సహా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉండనున్నాయి. ఈ ప్యాకేజీల వారీగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక వేళ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకుంటే మాత్రం బిడ్డింగ్ ద్వారా ఈ మూడు ప్యాకేజ్ లని ప్రైవేటు సంస్థలకి అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాల్టా చట్టానికి లోబడి ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news