కరెంట్ పోతే ఈ నెంబర్ కి కాల్ చేయండి…!

-

వేసవి కాలం వచ్చింది అంటే చాలా మందికి ఉండే సమస్య కరెంట్ కోతలు. పైన ఎండలు నరకం చూపిస్తున్న సమయంలో కరెంట్ పోతే పడే బాధలు అన్నీ ఇన్ని కాదు. ఒకరకంగా అది నరకం. గ్రామాల్లో ఉండే వాళ్ళు ఏ చెట్టు కింద అయినా కూర్చోవచ్చు గాని పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం చచ్చిపోయినట్టే.

అసలు ఇప్పుడు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో కరెంట్ అంతరాయం ఉన్న వాళ్ళు తమను సంప్రదించాలి అని ఏపీ సర్కార్ కొత్త టోల్ ఫ్రీ నెంబర్ ని ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారానికీ ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబరు ఇస్తు వస్తున్న జగన్ సర్కార్..

విద్యుత్తు అందరాయానికీ కూడా టోల్‌ఫ్రీ నంబర్‌ ఒకటి కేటాయించింది. ఎక్కడైనా కరెంటు అంతరాయం ఏర్పడితే చాలు తమకు చెప్పమని కోరుతుంది. 1912కు ఫోన్‌ చేయాలని, ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news