ఏపీలో పుంజుకున్న పోలింగ్ శాతం..

-

ఏపీ ఎన్నికల సంఘానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్న ఆయన ఉదయం ఎనిమిది గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అన్నారు. గత రెండు గంటల నుంచి పోలింగ్ వేగం పుంజుకుందని ఆయన అన్నారు. చిత్తూరు, తూర్పుగోదావరి లో చిన్న సంఘటనలు మా దృష్టికి వచ్చాయని ఆయన అన్నారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి పరిష్కరించారని ఆయన అన్నారు.

వెబ్ కాస్టింగ్ లో పర్యవేక్షిస్తున్నామని ఆయన అన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయా పోలింగ్ స్టేషన్లలోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముందు వార్డుల కౌంటింగ్ జరుగుతుంది… తర్వాత సర్పంచ్ ల కౌంటింగ్ చేస్తారని ఆయన అన్నారు. పింక్ కలర్ బ్యాలెట్ సర్పంచి ఎన్నికకు, బ్లూ కలర్ వార్డ్ మెంబర్ కు కేటాయించామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news