బిగ్ బ్రేకింగ్.. ఏపీ సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీక్..?

-

ఏపీ సచివాలయ ఉద్యోగాలు.. దాదాపు లక్షన్నర పోస్టులు ఒకే నోటిఫికేష్ లో కొన్ని నెలలక్రితం ఉద్యోగార్ధులను ఊరించాయిదాదాపు 20 లక్షల మంది ఈ పరీక్షలు రాశారుప్రభుత్వం రికార్డు సమయంలో ఈ పరీక్షలు నిర్వహించిందిఅంతే త్వరగా ఫలితాలూ ఇచ్చిందిసీఎం జగన్ తన స్వహస్తాలతో ఈ గురువారం ఈ ఫలితాలు విడుదల చేశారు.

అయితే.. ఇప్పుడో బ్రేకింగ్ న్యూస్ కలకలం రేపుతోందిఅదే.. ఈ సచివాలయ ఉద్యోగాల పరీక్ష పత్రాలు లీకయ్యాయన్నది.. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయంపై ఇవాళ బ్యానర్ కథనం ప్రచురించిందిఇవిగో ఆధారాలు అంటూ కొన్ని ఉదాహరణలు కూడా బయటపెట్టింది..

ఆ కథనం సారాంశం ఏంటంటే.. ఏపీపీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులే పేపర్ లీక్ చేశారటఆ పరీక్ష పేపర్లు సిద్ధంచేసిన ఏపీపీఎస్సీలోనే వారు పనిచేస్తున్నారటఅంతేకాదు పేపర్లు తయారుచేసిన విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు ఈ పరీక్షలకు హాజరయ్యారటగురువారం విడుదలచేసిన సచివాలయ ఫలితాల్లో కేటగిరి-1లో టాప్‌ ర్యాంకరు ఆమేనట!

ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారటఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారటపేపరు సంపాదించిన ఏపీపీఎస్సీలోని కొందరు ఉద్యోగులు.. దానిని గుట్టుగా ఉంచలేదుబంధువులుసన్నిహితులకూ లీక్‌ చేశారట.

పేపరు తయారీకిపరీక్ష నిర్వహణకు మధ్యలో ప్రశ్నపత్రం ఓ రిటైర్డు అధికారి చేతికి పోయిందటకేటగిరి-1లో టాప్‌ ర్యాంకర్‌ అనితమ్మ ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్నారటప్రశ్నపత్రం టైప్‌ చేసిందీ ఆమేనని కమిషన్‌ వర్గాలే అంటున్నాయటదొడ్డా వెంకట్రామిరెడ్డి కేటగిరి-3లో ఫస్ట్‌ ర్యాంకరు, .కేటగిరి-1లో మూడో ర్యాంకరుఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్‌వో గా పనిచేస్తున్నారట.

ఇప్పుడీ కథనం ఏపీలో కలకలం రేపుతోందిదాదాపు 20 లక్షల మంది అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోందిమరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news