వైసీపీకి బిగ్‌ షాక్.. 13 మంది సర్పంచుల మూకుమ్మడి రాజీనామా

-

కడప జిల్లా లో అధికార వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కడప జిల్లా లో ఏకంగా… 13 మంది వైసీపీ పార్టీ కి చెందిన సర్పంచులు మూకుమ్మడి గా రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు లో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక,,, 14 వ, 15 వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను కూడా ఏపీ ప్రభుత్వం దారి మళ్లిచడంతో.. ప్రభుత్వం నియంతృత్వ పోకడలను వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్దపడ్డట్లుగా తెలు స్తోంది.

ఇవాళ్టి నుంచి ఆయా పంచాయతీలలో.. వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తు లను.. శానిటేషన్‌ కార్య క్రమంతో పాటు గా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లు గా తెలియ జేశారు. ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా.. 13 సర్పంచులు ప్రత్యేకంగా సమా వేశమై… కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే… రాజీనామా చేస్తున్నట్లు గా పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news