కరోనా ఎఫెక్ట్: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ స్పీకర్..!

-

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి క్యాంపు కార్యాయాలు మూసివేయాలని మంత్రి ధర్మాన కృష్ణ‌దాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయించారు. దీంతో క్యాంపు కార్యాలయాలు నేటి నుంచి మూసివేశారు. ఇవాళ్టి నుంచి తమని కలిసేందుకు 15 రోజులు వరకు ఎవరూ రావద్దని ప్రకటనను కూడా విడుదల చేశారు. కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 21,071 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.వివిధ ఆస్పత్రులలో 10,544 చికిత్స పొందుతున్నారు. 10,250 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయ్యారు. రోజురోజుకు ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారిక వర్గాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news